సిబిఐ, రామోజీ రావుకి లింక్ పెట్టిన వైయస్ జగన్ సాక్షి

మూడు కేసుల్లో జగన్ను ఇరికించాలని ఎల్లో సిండికేట్ తపిస్తోందో చెప్పడానికి ఆధారాలు ఇవేనని, వైయస్సార్ కుటుంబానికి, సన్నిహితులకు, వారసుడుకి చుట్టడానికి దర్యాఫ్తు సంస్థతో కలిసి ఎల్లో సిండికేట్, ఢిల్లీ కాంగ్రెసు పెద్దలు ఎంతలా పతనమైపోతున్నదీ తెలుస్తోందని పేర్కొంది. సాధారణంగా దర్యాఫ్తు సంస్థలు తాము చెప్పని విషయాలు మీడియాలో వస్తే వివరణ ఇస్తాయని, కానీ ఇక్కడ మాత్రం అలా జరగడం లేదన్నది. ఎల్లో మీడియా ఎంతగా కథనాలు రాసినా సిబిఐ కిమ్మనడం లేదని, ఎవరికి తెలియని విషయాలు వారికే ఎలా తెలుస్తున్నాయన్నారు. పైగా ఆ మీడియా రాసిన కథనాల ప్రకారమే సిబిఐ తన పని చేసుకుంటూ పోతోందని, అందుకు విజయ సాయి రెడ్డి నార్కో అనాలిసిస్ పరీక్షల అంశమే ఉదాహరణ అని పేర్కొంది.












Click it and Unblock the Notifications