వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేవుళ్ల భూములు రక్షిస్తా: మంత్రి రామచంద్రయ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Ganta Srinivas Rao-Chiru-C Ramachandraiah
హైదరాబాద్: రాష్ట్రంలో దేవాలయ భూములను పరిరక్షిస్తానని, తన తొలి ప్రాధాన్యం అదేనని దేవాదాయ శాఖ మంత్రి సి. రామచంద్రయ్య చెప్పారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఆయన శనివారం పదవీబాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని సి- బ్లాక్‌లో తన ఛేంబర్‌లోకి ప్రవేశించి ఆయన పదవీబాధ్యతలు చేపట్టిన తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రంలోని గ్రామాల్లో గల దేవాలయాల్లో కూడా నిత్యం ధూపదీప నైవేద్యాలు జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. అర్చకుల సమస్యలు ప్రయత్నాలు చేస్తామని ఆయన చెప్పారు.

తనపై పెద్ద బాధ్యత ఉందని ఆయన చెప్పాీరు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రామచంద్రయ్యను కాంగ్రెసు శాసనసభ్యుడు చిరంజీవి, సినీ హీరో అల్లు అర్జున్, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కొంత మంది మంత్రులు కలుసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఇవో ఎల్వీ సుబ్రహ్మణ్యం సహా ఆలయ వేద పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు తగిన సౌకర్యాలు కల్పిస్తామని రామచంద్రయ్య చెప్పారు. ఉద్యోగులకు కూడా సమస్యలు లేకుండా చూస్తామని ఆయన అన్నారు.

English summary
Endowment minister C Ramachandraiah said that he will protect temple lands in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X