చిరంజీవి రేంజ్లో ఉత్తరప్రదేశ్లో మేం: అమర్ సింగ్

తెలంగాణలో పర్యటించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తనను ఎప్పుడూ ఆహ్వానించలేదని ఆయన చెప్పారు. ఆహ్వానిస్తే తాను తెలంగాణలో పర్యటిస్తానని ఆయన చెప్పారు. ప్రత్యేక పూర్వాంచల్ రాష్డ్ర ఏర్పాటే లక్ష్యంగా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో తాము పోటీ చేస్తున్నామని ఆయన చెప్పారు. ఉత్తరప్రదేశ్ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలనే మఖ్యమంత్రి మాయావతి ప్రతిపాదనను స్వాగతిస్తూనే ఎన్నికల సమయంలో ఆ ప్రకటన చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. రాజకీయ ప్రయోజనాల కోసమే మాయావతి యుపి విభజనను ముందుకు తెచ్చారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications