కిరణ్ దారిలో జగన్, బాబు!: ట్రెండ్ మార్చిన అధి'నేతలు'

YS Jagan-Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత, కడప పార్లమెంటు సభ్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తమ ట్రెండ్ మార్చినట్లుగా కనిపిస్తోంది. ఇటీవల వారు యువమంత్రం జపిస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి యువతను బుట్టలో వేసుకోవడానికి రాజీవ్ యువకిరణాలు అంటున్నప్పటి నుండి విపక్షాలు ఆ వైపు మరింత దృష్టి సారించినట్లుగా కనిపిస్తోంది. గత సంవత్సరం మార్చిలోనే జగన్ ఫీజు పోరు పేరిట హైదరాబాదులో దీక్ష చేసినప్పటికీ ఇటీవలి కాలంలో యూత్ పైన ఆయన దృష్టి పెరిగినట్లుగా కనిపిస్తోంది. ఆయన ఓదార్పు యాత్రలో కూడా యువతే బాగుంటుంది. యూత్‌కు యువకుడైన తమ పార్టీ అధినేతే ఐకాన్ అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెసు వైపు యువతను మళ్లించేందుకు ముఖ్యమంత్రి రాజీవ్ యువకిరణాలు పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఈ పథకం ఇప్పటికే యువత నోళ్లలో జోరుగా నానుతోంది. ఈ పథకం పట్ల యువత కూడా అంతో ఇంత అనుకూలంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. దీంతో సిఎం ప్రవేశ పెట్టిన ఈ పథకం లక్ష్యం కొంతలో కొంతైనా నెరవేరిందనే చెప్పవచ్చు. కిరణ్ తాను పీఠం ఎక్కినప్పటి నుండే యువత వైపు చూస్తున్నారు.

ఇక కిరణ్, జగన్ కంటే కూడా చంద్రబాబు జోరుగా యువత వైపు దూసుకు పోతున్నారు. యువతరంగం పేరిట ప్రధాన పట్టణాల్లో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో తన పాలనలో యువత కోసం చేపట్టిన కార్యక్రమాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. యువతకు హామీలు గుప్పిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో యువతకు 33 శాతం టిక్కెట్లు కేటాయిస్తామని చెబుతున్నారు. ఇన్నాళ్లూ రైతుల పేరు జపించిన మన నేతలు ఇప్పుడు యువత మంత్రం జపించడం వెనుక ఓ కారణముందంటున్నారు. సాధారణంగా రైతులు తాము ఏ పార్టీకి ఫిక్స్ అయిపోతే అదే పార్టీకి ఓటేస్తారు. కానీ యువత మాత్రం ఎప్పుడూ మార్పు కోరుకుంటుంది. అందుకే మన నేతలు వారిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+