జగన్ పార్టీ ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో అడుగు: మేకపాటి

కాగా పార్టీ జారీ చేసిన విప్ ధిక్కరిస్తూ గత సంవత్సరం డిసెంబర్ ఆరో తేదిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాసానికి మద్దతుగా జగన్ వర్గానికి చెందిన పదిహేడు మంది ఎమ్మెల్యేలు ఓటు వేసిన విషయం తెలిసిందే. వారిపై ప్రభుత్వం ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. ఇటు తెలంగాణ, అటు సీమాంధ్రలో ఒకేసారి ఉప ఎన్నికలు వస్తే ఎదుర్కోవడం కష్టమనే ఉద్దేశ్యంతోనే వారిపై అనర్హత వేటు విషయంలో జాప్యం జరుగుతుందని విపక్షాలు ఆరోపిస్తున్నారు. విప్ ధిక్కరించి, స్పీకర్ వివరణ తీసుకోవడం కూడా పూర్తయింది. అయితే ఇప్పటి వరకు స్పీకర్ వారిపై నిర్ణయం తీసుకోలేదు.












Click it and Unblock the Notifications