హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అరెస్టు చేసుకోండి: ప్రభుత్వానికి లోక్‌సత్తా జెపి సవాల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Jayaprakash Narayana
హైదరాబాద్: మన రాష్ట్ర రైతులు పండించిన ధాన్యాన్ని భుజాల మీద వేసుకొని కర్నాటకకు తీసుకు వెళతామని సర్కారుకు చేతనైతే తమను అరెస్టు చేసి ప్రాసిక్యూట్ చేయాలని లోక్ సత్తా అధ్యక్షుడు, కూకట్ పల్లి శాసనసభ్యుడు జయప్రకాశ్ నారాయణ గురువారం ప్రభుత్వానికి సవాల్ విసిరారు. వ్యవసాయానికి ప్రభుత్వమే గుదిబండగా మారిందని ఆయన ఆరోపించారు. ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి రైతులు ధాన్యం తరలించుకునేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని, అయినా నిత్యావసర సరుకుల చట్టం కింద కేంద్రం ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం సన్నరకం ధాన్యాన్ని, బియ్యాన్ని పక్క రాష్ట్రాల్లో అమ్ముకోనీయకుండా రైతులను అడ్డుకుంటోందని, వారికి లాభసాటి ధర రాకుండా చేస్తోందని ఆరోపించారు. పంట రవాణాపై ఆంక్షలను వ్యతిరేకిస్తూ, మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18, 19 తేదీల్లో రైతు నాయకులతో కలిసి తాను కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నుండి కర్నాటకలోని రాయచూర్ వరకు సత్యాగ్రహ పాదయాత్ర చేస్తానని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వమే రైతుల పట్ల వీధి రౌడీలా ప్రవర్తిస్తోందన్నారు. అందుకే తాము ధాన్యాన్ని రాయచూర్ తీసుకు వెళ్లేందుకు సిద్ధమయ్యామని చేతనేతే అరెస్టు చేయాలని సవాల్ చేశారు. రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న దుర్మార్గపు విధానాలనే కొనసాగిస్తే మాత్రం తమ పోరాటం ఆగదన్నారు. రైతులు సంఘటితం కాలేరన్న ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం తన విధానాలను కొనసాగిస్తోందని విమర్శించారు. భూకేటాయింపులపై నియమించిన సంయుక్త సభా సంఘంలో లోక్ సత్తా పార్టీకి స్థానం కల్పించినందుకు చాలామంది బాధపడుతున్నట్టుగా తెలిసిందని, తమ పార్టీ ఎవరినీ అర్థించదని, సంఖ్యాబలం ఉన్న పార్టీలు సభా సంఘంలో ఇంకా ఎక్కువ సభ్యులుండాలని కోరుకుంటుంటే తాను ఆ కమిటీ నుండి తప్పుకోవడానికి సిద్ధమన్నారు.

English summary
Loksatta Jayaprakash Narayana challenged state Government on thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X