మ.నగర్ కాంగ్రెసు అభ్యర్థి విజయలక్ష్మి, పోటీలో బిజెపి

Mahabubnagar Map
హైదరాబాద్: మహబూబ్ నగర్ నియోజకవర్గం అభ్యర్థిని కాంగ్రెసు పార్టీ ప్రకటించింది. త్వరలో తెలంగాణలోని ఆరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవ్వురులో ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. మహబూబ్ నగర్ నుండి కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేసేందుకు దివంగత ఎమ్మెల్యే రాజేశ్వర రెడ్డి సతీమణి విజయలక్ష్మి సంసిద్ధత వ్యక్తం చేశారు. ఉదయం ఆమె ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కలిశారు. ఆమె పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఓకే చెప్పారు. దీంతో పార్టీ తరఫున ఆమెకు టిక్కెట్ ఇచ్చేందుకు రంగం సిద్ధమైపోయింది. ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ పలువురు నేతలు భేటీ కానున్నారు. కామారెడ్డి స్థానం నుండి పోటీ చేసే అభ్యర్థిపై చర్చించనున్నారు. సాయంత్రం అభ్యర్థిని ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆమెను ఏకగ్రీవంగా చేసే దిశలో ప్రయత్నాలు చేయాలని ముఖ్యమంత్రి, ఇతర సీనియర్లు ఇదివరకే సూచించినప్పటికీ ఆ దిశలో ఎంత వరకు ప్రయత్నాలు జరిగాయో తెలియదు. టిఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది. బిజెపి కూడా ప్రకటించేందుకు సిద్ధంగా ఉంది.

మరోవైపు భారతీయ జనతా పార్టీ ఉప ఎన్నికల రంగంలోకి దూకింది. తాము మహబూబ్ నగర్ స్థానం నుండి పోటీ చేస్తామని ఆ పార్టీ నేత లక్ష్మణ్ ప్రకటించారు. రెండు రోజుల్లో అభ్యర్థిని ఖరారు చేస్తామని చెప్పారు. మరో మూడు నియోజకవర్గాలలో పోటీ చేసేందుకు ఆ పార్టీ సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బిజెపి మిగిలిన నియోజకవర్గాలలోనూ రంగంలోకి దిగితే అది తెలంగాణ రాష్ట్ర సమికి నష్టం చేస్తుందనే చెప్పవచ్చు. ఇదే భయం టిఆర్ఎస్ నేతల్లో ఉంది. పోటీ నుండి తప్పుకోవాలని టిఆర్ఎస్ నేతలు బిజెపిని బుజ్జగిస్తున్నట్లుగా సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+