హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌ను ఎదుర్కోలేకే, బాబుకు పరువుంటే కదా: గట్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gattu Ramachandra Rao
హైదరాబాద్: తమ పార్టీ అధినేత, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేకే తెలుగుదేశం పార్టీ గోబెల్స్ ప్రచారం చేస్తుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, మాజీ మంత్రి గట్టు రామచంద్ర రావు ఆదివారం అన్నారు. ఆయన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఇప్పటికీ ప్రజల గుండెల్లో ఉన్నారన్నారు. కాంగ్రెసుకు నిజమైన ప్రతిపక్ష పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ అన్నారు. టిడిపి కాంగ్రెసుకు బ్రాంచ్ కార్యాలయంగా మారిందని విమర్శించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవ్వూరులో సిపిఎం అభ్యర్థిని ప్రకటించి టిడిపికి షాక్ ఇచ్చిందన్నారు. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడును విమర్శిస్తే పరువు నష్టం దావా వేస్తామని ఆ పార్టీ నేత ఎర్రన్నాయుడు అంటున్నారని కానీ బాబుకు అసలు పరువు ఉంటే కదా అన్నారు.

చంద్రబాబు అబద్దాలతో రాజకీయం చేశారని అన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెసు, టిడిపిలకు ధరావత్తు కూడా దక్కదన్నారు. ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచితే తమ పార్టీ ఉద్యమిస్తుందన్నారు. వైయస్ హయాంలో ఏ రకమైన ఛార్జీలు పెంచలేదన్నారు. వైయస్ ఇచ్చిన హామీలు కాంగ్రెసు నెరవేర్చకుంటే తమ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. మద్యం సిండికేట్లలో కాంగ్రెసుతో సమానంగా తెలుగుదేశం పార్టీకి భాగస్వామ్యం ఉందని ఆయన ఆరోపించారు.

English summary
YSR Congress Party leader Gattu Ramachandra Rao blamed Telugudesam Party. He said TDP is branch office to Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X