హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోసం చేసిన ఆ పార్టీలను పాతరేయాలి: నాయిని

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nayini Narasimha Reddy
హైదరాబాద్: తెలంగాణ అంశాన్ని ఎన్నికల ముసాయిదాలో పెట్టి ఆ తర్వాత మాట మార్చిన తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలను ఉప ఎన్నికల్లో పాతరేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు ఈటెల రాజేందర్, నాయిని నర్సింహా రెడ్డి ఆదివారం ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు ఆయా నియోజకవర్గాలకు టిఆర్ఎస్ తరఫున అభ్యర్థులను ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మోసం చేసిన కాంగ్రెసు, టిడిపులకు ఉప ఎన్నికల్లో కనువిప్పు కలిగించాలన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం జరుగుతున్న ఎన్నికలు ఇవి అన్నారు. ఉప ఎన్నికల్లో త్యాగధనులను గెలిపించి తెలంగాణవాదం చాటాలన్నారు. మోసం చేసిన పార్టీలకు ధరావత్తు కూడా దక్కవద్దన్నారు. తెలుగుదేశం ఆంధ్రా బాబుల పార్టీ అన్నారు.

కాగా ఉప ఎన్నికల అభ్యర్థులను ప్రకటించారు. మహబూబ్ నగర్ - సయ్యద్ ఇబ్రహీం, స్టేషన్ ఘనపూర్ - రాజయ్య, కొల్లాపూర్ - జూపల్లి కృష్ణా రావు, కామారెడ్డి - గంపా గోవర్ధన్, అదిలాబాద్ - జోగు రామన్నలను ప్రకటించారు. నాగర్ కర్నూలులో తెలంగాణ నగారా సమితి చైర్మన్, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డికి మద్దతు ప్రకటించారు.

English summary
TRS leader Nayini Narasimha Reddy called Telangana people to defeat Telugudesam and Congress Party in byelection.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X