పాతబస్తీలో మాజీఎంపీ మధుపై మజ్లిస్ కార్యకర్తల దాడి

Madhu
హైదరాబాద్: సిపిఎం నేత, మాజీ పార్లమెంటు సభ్యుడు మధుపై సోమవారం మజ్లిస్ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. ఎంపి మధుపై దాడి యాకుత్‌పురా శాసనసభ్యుడు ముంతాజ్ ఖాన్, స్థానిక కార్పోరేటర్ వజీద్ అలీ సమక్షంలోనే జరిగింది. ఉదయం పాతబస్తీలో ఓ కార్యకర్తను పరామర్శించేందుకు మధు అక్కడకు వెళ్లారు. మధును మజ్లిస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. మజ్లిస్ కార్యకర్తలు మధుపై దాడి చేశారు.

కాగా మధుపై దాడి నేపథ్యంలో ఘటనా ప్రాంతంలో భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. మధుపై మజ్లిస్ కార్యకర్తల దాడిని సిపిఎం కార్యకర్తలు ఖండించారు. పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని భవానీ నగర్ పోలీసు స్టేషన్ ఎదుట కార్యకర్తలు బైఠాయించారు. దాడిలో గాయపడ్డ మధు కూడా పిఎస్ ముందు బైఠాయించారు. ఒక ఎమ్మెల్యే, కార్పోరేటర్ సమక్షంలోనే దాడి జరిగిందని నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఆయన పోలీసులను డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+