చంద్రబాబుపై ముత్యం రెడ్డి, టిడిపి లింగా రెడ్డిపై సిఎం

ఆ తర్వాత సిఎం కిరణ్ మాట్లాడుతుండగా టిడిపి నేతలు పలుమార్లు ఆయన ప్రసంగానికి అడ్డు తగిలే ప్రయత్నాలు చేశారు. లింగా రెడ్డి నిలబడి కిరణ్ ప్రసంగం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆగ్రహోద్రుడైన కిరణ్ హోప్ లెస్ ఫెలో అంటూ మండిపడ్డారు. దీనికి టిడిపి నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే తాను ఏదైనా అన్ పార్లమెంటరీ పదాలు ఉపయోగిస్తే వాటిని వెనక్కి తీసుకుంటున్నానని ముఖ్యమంత్రి చెప్పారు.
కాగా ఆ తర్వాత చంద్రబాబు సభలో మాట్లాడారు. వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉందని అన్నారు. ధాన్యానికి మద్దతు ధర లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెసు ప్రభుత్వం హయాంలో రైతులు ఆర్థికంగా చితికి పోతున్నారన్నారు. రాష్ట్రంలోని గోదాములన్నింటిని నిర్మించింది టిడిపియేనన్నారు. నష్టాల్లో ఉన్న విద్యుత్ డిస్కంలకు ఎలా న్యాయం చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. వాస్తవాలు కఠోరంగా ఉంటాయని కాంగ్రెసు వారు కాస్త ఓపిగ్గా వినాలన్నారు. మేం ప్రవేశ పెట్టిన ఈ-సేవను మీరు మీ-సేవగా మార్చారన్నారు. గవర్నర్ ప్రసంగంపై అభ్యంతరం వ్యక్తం చేసిన టిడిపి, సిపిఐ సభ నుండి వాకౌట్ చేశాయి. శాసనసభ గవర్నర్ ప్రసంగాన్ని ఆమోదించింది.
-
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త!












Click it and Unblock the Notifications