హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ సిఎం కావాలని ఆకాంక్షిస్తున్నారు: శోభా నాగిరెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Shobha Nagi Reddy
హైదరాబాద్: రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైయస్సార్ కాంగ్రెసు పార్టీయే అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శోభా నాగి రెడ్డి సోమవారం తిరుపతిలో అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలు ఆకాంక్షిస్తున్నారని ఆమె అన్నారు. తమపై వేటు వేసి ఉప ఎన్నికలకు వెళ్లే ధైర్యం లేకే కాంగ్రెసు ప్రభుత్వంపై తమపై చర్యలు తీసుకోవడం లేదని ఆమె అన్నారు. కాంగ్రెసుకు దమ్ముంటే తమపై వేటు వేసి వెంటనే ఉప ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని ఆ పార్టీ నేత బాజిరెడ్డిగోవర్ధన్ రెడ్డి వేరుగా అన్నారు. టిఆర్ఎస్‌కు అక్కడ పోటీ చేసే హక్కు ఉందన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో పోటీ చేసే అంశంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. కేటాయించిన ఇరిగేషన్ బడ్జెట్ ను కాలవ్యవధిలో ఖర్చు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జలయజ్ఞం ప్రాజెక్టులపై తాజాగా తెచ్చిన జివోను ప్రభుత్వం రద్దు చేయాలన్నారు. ప్రాజెక్టులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ఆలస్యమైతే పెద్ద ఎత్తున వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉద్యమిస్తుందన్నారు.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy became CM said, Allagaada MLA Shobha Nagi Reddy today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X