హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నీ మనవడి పేరుపై కంపెనీ ఎక్కడ?: కెసిఆర్‌కు ఎర్రబెల్లి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Errabelli Dayakar Rao
హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద మోసగాడు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అని తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు మంగళవారం మండిపడ్డారు. కెసిఆర్ తన పార్టీ నుండి తెలంగాణవాదలను వెళ్లగొట్టారని ధ్వజమెత్తారు. డబ్బు సంచులు ఇచ్చిన వారికే టిఆర్ఎస్ పార్టీ తరఫున కెసిఆర్ టిక్కెట్ ఇస్తారని ఆరోపించారు. కెసిఆర్ మోసాలపై తాము బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. తెలంగాణ ప్రజలను మోసం చేసిన చరిత్ర కెసిఆర్‌దేనన్నారు. ఆచార్య జయశంకర్‌కు పదవి ఇస్తానని కెసిఆర్ మోసం చేశారన్నారు. రాజ్యసభ సీటు ఇస్తానని జయశంకర్‌కు చెప్పి ఆ తర్వాత ఇవ్వకుండా మోసం చేశారన్నారు. గల్ఫ్‌లో ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి మోసం చేసినందుకు కెసిఆర్ పైన 420 కేసు పెట్టలేదా అని ప్రశ్నించారు.

తన మనవడి పేరుతో కెసిఆర్ పెట్టిన కంపెనీ ఎక్కడకు పోయిందని ఎర్రబెల్లి ప్రశ్నించారు. అందులోని పెట్టుబడులు ఏమయ్యాయో చెప్పాలన్నారు. తేది ఎప్పుడో కెసిఆర్ ప్రకటిస్తే తాము కెసిఆర్ బినామీ ఆస్తులపై బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. కాగా సోమవారం తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు కూడా చంద్రశేఖర రావుపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డ విషయం తెలిసిందే.

English summary
TDP senior leader Errabelli Dayakar Rao challenged TRS chief K Chandrasekhar Rao on his properties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X