జూ.ఎన్టీఆర్ ప్రమాదాన్ని వాడుకున్నావ్: బాబుపై అంబటి

వారిపై విమర్శలు చేస్తుంటే ప్రజలు చూసి బాధపడున్నారన్నారు. నీకు రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్నే నీవు మోసం చేశావన్నారు. నీ తమ్ముడు, ఎన్టీఆర్ కుమారులు ఇలా అందరినీ మోసం చేశావని విమర్శించారు. నీకు బాంధవ్యాలు లేవన్నారు. అధికారం, డబ్బు మదంతో రాక్షసుడిగా మారావన్నారు. బాబు గతం మర్చిపోయి మాట్లాడుతున్నారన్నారు. మీ అమ్మకు హైదరాబాదులో ఇల్లు, బ్బు ఎక్కడిదని ప్రశ్నించారు. అయినా ఆ డబ్బు, ఇల్లును నీ కొడుక్కే ఎందుకిచ్చారని, రామ్మూర్తి నాయుడు తనయులకు ఎందుకివ్వలేదన్నారు. నర రూప రాక్షసుడిగా వ్యవహరించావన్నారు. కొవ్వూరు ఎన్నికల్లో టిడిపి, కాంగ్రెసులకు డిపాజిట్ కూడా రాదన్నారు. కొవ్వూరు జగన్ ప్రచారంపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఖబర్దార్ అని హెచ్చరించారు. ప్రజలు బాబుకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 21వ తారీఖున సిద్ధంగా ఉండని అన్నారు. బాబు అధికారం రాదనే ప్రస్టేషన్లో మాట్లాడుతున్నారని, ఆ మాటలకు అర్ధం లేకుండా పోయిందన్నారు.
ఓ సెంటిమెంట్ కారణంగా రాజీనామాలు చేశారు కాబట్టి తాము తెలంగాణలోని పోటీ పెట్టమని స్పష్టం చేశామని అన్నారు. పరకాల నియోజకవర్గం నుండి కొండా సురేఖపై పోటీ పెట్టడం పెట్టక పోవడం ఆయా పార్టీల నిర్ణయమని, తాము మాత్రం అడిగి చూస్తామని చెప్పారు. కాంగ్రెసు, టిడిపిలకు కొవ్వూరులో డిపాజిట్ వస్తే అందరం ఆశ్చర్య పోవాల్సిందేనన్నారు. తన తనయుడు లోకేష్ కుమార్ విదేశాల్లో చదివాడని, అందుకు తాను గర్వపడుతున్నానని బాబు చెప్పారని, ఇక్కడ చదివిన వారు గర్వపడ కూడదా అని ప్రశ్నించారు. ఇక్కడ చదివిన వారు విదేశాలలో మంచి మంచి స్థాయిల్లో ఉన్నారన్నారు.












Click it and Unblock the Notifications