అతను స్త్రీలపై వరుస దాడులు చేస్తున్న సైకో కాడు

Guntur Map
గుంటూరు: గత శనివారంనాడు స్థానికుల చేతిలో దెబ్బలు తిని హతమైన వ్యక్తి గుంటూరు జిల్లా తెనాలి డివిజన్‌లో మహిళలపై వరుస దాడులు చేస్తున్న సైకో కాడని పోలీసులు తేల్చేశారు. శనివారంనాడు మంగళగిరి మండలంలోని ఓ గ్రామంలో మహిళలపై దాడి చేశాడని ఆరోపిస్తూ ఓ యువకుడిని చితకబాదారు. అతన్ని ఆస్పత్రిలో చేర్చారు. అయితే, చికిత్స పొందుతూ మతిస్థిమితం లేని ఆ యువకుడు మరణించాడు. దీంతో పోలీసులు గుర్తు తెలియని గ్రామస్థులపై కేసు నమోదు చేశారు.

మరణించిన యువకుడి ఛాయాచిత్రాన్ని పోలీసులు మహిళలకు చూపించారు. అయితే, తమపై దాడి చేసిన యువకుడు అతను కాదని మహిళలు చెప్పినట్లు సమాచారం. మహిళలపై దాడి చేశాడని ఆరోపిస్తూ శనివారంనాడు పెదవడ్లపూడి గ్రామంలో స్థానికులు ఓ యువకుడిని చితకబాదారు. ఆ దెబ్బలకు అతను మరణించాడు. హత్యకు గురైన ఈ యువకుడిని గుర్తించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరణించిన యువకుడు వచ్చీ రాని హిందీలో మాట్లాడాడని, అతను ఒరిస్సాకు సంబంధించినవాడై ఉండవచ్చునని ఒఎస్‌డీ (ఉత్తరం) అన్నపూర్ణా రెడ్డి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+