సిఎం కోవూరు సభలో రికార్డు డ్యాన్స్ల జోరు

తమ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కుమ్మక్కయ్యారని ఆయన విమర్శించారు. ఇతర పార్టీల నాయకులు చెప్పే కల్లబొల్లి కబుర్లు నమ్మొద్దని ఆయన ఓటర్లకు హితవు చెప్పారు. కోవూరు ఎన్నికలు చరిత్ర సృష్టించే ఎన్నికలని, తమ ప్రభుత్వ కార్యక్రమాలకు మద్దతు ఉందని చెప్పడానికి కాంగ్రెసుకు ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు.
తమ కాంగ్రెసు అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని గెలిపిస్తే కోవూరును తన నియోజకవర్గం చూసుకుంటున్నట్లు చూసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. సమస్యలను అన్నింటినీ పరిష్కరిస్తానని ఆయన చెప్పారు. ఇవి మామూలు ఎన్నిక కాదని, అందుకే కాంగ్రెసుకు ప్రజలు ఓటేయాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications