నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ విగ్రహాలుచూస్తే దొంగబుద్దులు,సాక్షి వద్దు: బాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
నెల్లూరు: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు చూస్తే పిల్లలకు జేబులు కొట్టే అలవాటు వస్తుందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురువారం ఆరోపించారు. శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా కొవ్వూరు ఉప ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడాతూ... గాంధీ మహాత్ముడు స్వాతంత్య్రం కోసం పోరాడాడని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించాడని వారి విగ్రహాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం అన్నారు. కానీ, వైయస్ విగ్రహాలు చూస్తే పిల్లలకు జేబులు కొట్టే అలవాటు వస్తుందని విమర్శించారు. వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి దొంగ అయితే, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ ఓ గజదొంగ అని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా జరిగిన ప్రచార సభల్లో, అంతకుముందు తిరుపతి విమానాశ్రయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. 1993 నుంచి 2009 వరకు పార్టీ టికెట్ ఇవ్వడమే కాదని, పైసలు కూడా ఖర్చు చేసి ప్రసన్నను గెలిపించామని, కానీ, రెండు నెలలు తిరగకముందే ఆయన వైయస్ఆర్ ఆకర్ష్‌లో చిక్కాడని, డబ్బు సంచులు తెచ్చుకుని దొంగగా మారాడని, ఆ దొంగను అభ్యర్థిగా పెట్టడం ద్వారా జగన్ మరో గజదొంగ అయ్యాడని, సిబిఐ అరెస్ట్ చేస్తుందని భయపడి ఇంట్లోనే దాక్కొన్న జగన్ దొంగ లెక్కలు రాయడంలో సిద్దహస్తుడని, నేను చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పిన తర్వాతే ఆయన ప్రజలను ఓట్లు అడగాలని బాబు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ దొంగల పార్టీ అని, ఆ చెట్టు నుంచి పుట్టిన విషపు కొమ్మ జగన్ అని దుయ్యబట్టారు.

జగన్ అధికారంలోకి వస్తే పాలన పిచ్చోడి చేతిలో రాయి అవుతుందన్నారు. వైఎస్ చేసినంత అన్యాయం, అవినీతి ఏ సిఎం చేయలేదన్నారు. రెండేళ్లుగా ఓదార్పు చేస్తున్న జగన్ ఓ దోషి అని, ఆయన్ని ఓదార్చే సమయం ఆసన్నమైందని చెప్పారు. పాపిష్టి సొమ్ముతో పెట్టిన జగన్ పత్రిక చదవొద్దని, చానల్‌ను చూడొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. 30 ఏళ్ల చరిత్ర కలిగిన టిడిపి ఒక్క పత్రిక కూడా పెట్టలేదన్నారు. టిడిపి ఎప్పుడూ అవినీతికి పాల్పడలేదని, 30 ఏళ్లుగా రాజీలేని పోరాటం చేస్తున్న తమకు ఎవరితోనూ కుమ్మక్కు కావాల్సిన అవసరం లేదని చెప్పారు. చిరంజీవి సినిమా డబ్బా తిరుగుటపా అయిందని, కానీ, ఎన్టీఆర్ మడమ తిప్పని నేత అని కొనియాడారు. యూపీ ఫలితమే 2014లో ఆంధ్రప్రదేశ్‌లోనూ పునరావృతమవుతుందని జోస్యం చెప్పారు. ఇక టిడిపి సైకిల్ స్పీడుకు తిరుగు లేదన్నారు. ప్రతిపక్షాల డిమాండ్ మేరకే చిత్తూరు, విజయనగరం జిల్లాల్లోని మద్యం మాఫియాపై ఎసిబి దాడులకు ప్రభుత్వం ఆదేశించిందని చెప్పారు. తెలంగాణతోపాటు కోవూరులోనూ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

English summary
TDP chief Nara Chandrababu Naidu blamed late YSR and YS Jagan and Chiranjeevi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X