హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవి నలభై వాహనాలతో రోడ్డు షో: జగన్ పార్టీ నేత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gattu Ramachandra Rao
హైదరాబాద్: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవూరు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్ర రావు బుధవారం ఆరోపించారు. కొవూరులో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి నలబై వాహనాలతో రోడ్డు షో నిర్వహించి, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఎన్నికల అధికారి భన్వర్ లాల్‌కు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలోని టిడిపి నాయకుల ఇళ్లలో పోలీసులు మద్యం స్వాధీనం చేసుకొని కూడా కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. ఓటర్లను ప్రభావితం చేసే విధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన టిడిపి అభ్యర్థి పైనా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

English summary
YSR Congress Party leader Gattu Ramachandra Rao blamed Tirupati MLA Chiranjeevi and PCC chief Botsa Satyanarayana for code of violating.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X