బెంగళూరులో పెనుగొండ కాళేశ్వర్ బాబా మృతి

Kaleshwar Baba
బెంగళూరు/అనంతపురం: అనంతపురం జిల్లా పెనుగొండకు చెందిన కాళేశ్వర బాబా మృతి చెందారు. గత కొంతకాలంగా కిడ్నీ, లివర్ సంబంధ వ్యాధితో బాధపడుతున్న కాళేశ్వర్ బాబా గురువారం మృతి చెందారు. అస్వస్థత కారణంగా కాళేశ్వర్ బాబా మూడు రోజుల క్రితం కర్నాటకలోని బెంగళూరులో కొలంబియా ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు. చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. మొదట ఈయన మృతిపై ఆశ్రమ సిబ్బంది నోరు మెదపడం లేదని తెలిసింది.

కాగా కాళేశ్వర బాబా చనిపోయారనే వార్తల నేపథ్యంలో ఆశ్రమానికి భారీగా భక్తులు చేరుకుంటున్నారు. బాబాపై పలు ఆరోపణలు ఉన్నాయి. భూకబ్జాలు, గనుల తవ్వకాల అంశాల్లో ఆరోపణలు ఉన్నాయి. ఇంటర్ తర్వాత బాబా అవతారం ఎత్తారు. మంత్రి రఘువీరా రెడ్డి బాబాను బుధవారం ఆసుపత్రిలో పరామర్శించారు. బాబా వయస్సు 38 ఉంటుంది. ఇతను కాళేశ్వర్ సమర్థ మహారాజ్‌గా పేరుగాంచారు.

కాగా మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో కొలంబియా ఆసుపత్రి వర్గాలు కాళేశ్వర్ బాబా మృతిని ధృవీకరించాయి. బాబా మృతదేహాన్ని బెంగళూరు నుండి పెనుగొండకు తరలించనున్నారు. శనివారం అంత్యక్రియలు జరగనున్నాయి. బాబాది కడప జిల్లాకు చెందిన మాధవవరం. ఇతను అదే జిల్లాకు చెందిన శిల్పను వివాహం చేసుకున్నారు. వీరికి నవ్యశ్రీ అనే మూడేళ్ల కూతురు ఉంది. బాబా అసలు పేరు సుబ్రహ్మణ్యం. కాగా అతను కిడ్నీ సంబంధ వ్యాధితో బాధ పడలేదని, లివర్ సంబంధ వ్యాధితో బాధపడ్డారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+