వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మ.నగర్ కెసిఆర్‌కు పరీక్ష, బిజెపికి ప్రతిష్టాత్మకం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kishan Reddy-K Chandrasekhar Rao
మహబూబ్‌నగర్: తెలంగాణ అంశంతో సంబంధం లేకుండా జరుగుతున్న మహబూబ్‌నగర్ ఎన్నిక తెలంగాణ వాదాన్ని వినిపిస్తున్న టిఆర్ఎస్, బిజెపిలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. మహబూబ్‌నగర్ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బిజెపి ప్రచారాన్ని దూకుడుగా చేపట్టింది. ఆ పార్టీ నాయకులు లక్ష్మణ్, నరేంద్ర వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారంటూ పార్టీ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్ రెడ్డికి ఈసీ నోటీసులు జారీచేసింది. ప్రాంతీయపార్టీలతో తెలంగాణ రాదని, రాష్ట్రం ఇచ్చే సత్తా జాతీయ పార్టీ అయిన తమకే ఉందంటూ బిజెపి జాతీయ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి ప్రచారం చేశారు. ఈ ప్రచారాన్ని, టిఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తిప్పికొట్టారు.

కెసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్‌నగర్ లోకసభ పరిధిలోనే ఈ నియోజకవర్గం ఉండటంతో.. టిఆర్ఎస్ అధినేతకు ఈ ఎన్నిక విషమ పరీక్షగా మారింది. ఇక, తెలంగాణలోని ఆరు స్థానాల్లో రాజీనామాలతో ఎన్నికలు జరుగుతుండగా, మహబూబ్‌నగర్‌లో మాత్రం ఎమ్మెల్యే ఆకస్మిక మరణంతో ఎన్నిక జరుగుతున్నందున ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోకపోతే, సొంత పార్టీలోని వ్యతిరేక వర్గీయులు మరింత రెచ్చి పోవచ్చన్న భావనతో, ఈ సెగ్మెంటును ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.

English summary
BJP versus TRS in Mahaboobnagar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X