వచ్చే ఉప ఎన్నికలకు అప్పుడే ముఖ్యమంత్రి కసరత్తు

Kiran Kumar Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గం శాసనభ్యులపై వేటు వేయడం వల్ల ఖాళీ అయిన 17 స్థానాల ఉప ఎన్నికలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడే కసరత్తు ప్రారంభించారు. ఏడు నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడనున్న నేపథ్యంలో ఆయన మంగళవారం సాయంత్రం కొన్ని జిల్లాల మంత్రులు, శాసనసభ్యులతో సమావేశమయ్యారు. ఆ జిల్లాల్లో జరిగే ఉప ఎన్నికలపై చర్చించారు. ఒక్కో నియోజకవర్గం బాధ్యతను ఒక్కో మంత్రికి అప్పగించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.

మంగళవారం సాయంత్రం కిరణ్ కుమార్ రెడ్డి శ్రీకాకుళం, వరంగల్, కర్నూలు, కడప, పశ్చిమ గోదావరి జిల్లాల మంత్రులు, శాసనసభ్యులతో సమావేశమయ్యారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గానికి మంత్రి టిజి వెంకటేష్‌ను, ఆళ్లగడ్డ నియోజకవర్గానికి ఏరాసు ప్రతాప రెడ్డిని ఆయన ఇంచార్జీగా నియమించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం బాధ్యతలను పితాని సత్యనారాయణకు పోలవరం నియోజకవర్గం బాధ్యతలను వట్టి వసంతకుమార్‌కు అప్పగించారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నియోజకవర్గం బాధ్యతలను మంత్రి ధర్మాన ప్రసాదరావుకు అప్పగించారు. ఈ నెలాఖరున 17 స్థానాలకు కాంగ్రెసు పార్టీ అభ్యర్థులను ప్రకటించడానికి కసరత్తు జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+