ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వాగులో పడిన బస్సు, 12 మంది విద్యార్థుల మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Khammam District
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఖమ్మం జిల్లా చండ్రుగొండు మండలం తుంగారం వద్ద వాగులో పాఠశాల బస్సు పడి పది మంది మరణించారు. బస్సు అదుపు తప్పి వంతెనపై నుంచి వాగులో పడింది. ఈ ప్రమాదంలో 12 మంది విద్యార్థులు మరణించగా, పలువురు గాయపడినట్లు సమాచారం.సంఘటనా స్థలంలో విషాద వాతావరణం చోటు చేసుకుంది.

కొత్తగూడెం మండలం వేపలగండ్ల గ్రామానికి చెందిన ఎల్వీ రెడ్డి పాఠశాల బస్సు వాగులో పడింది. దీంతో ప్రమాదం సంభవించింది. బస్సు ఎందుకు అదుపు తప్పిందనేది తెలియడం లేదు. బస్సు డ్రైవర్ ఆచూకీ కూడా తెలియడం లేదు. విద్యార్థులను బస్సులో పాఠశాల నుంచి వారివారి స్వస్థలాలకు తీసుకుని వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. బస్సులో 50 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది.

సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాయంత్రం ఐదున్నర గంటల సమయానికి ఎనిమిది మృతదేహాలను వెలికి తీశారు. మృతుల్లో నవ్య, మణికంఠ, గణేష్, సౌజన్య, సంతోష్ ఉన్నట్లు చెబుతున్నారు.

English summary
Ten students dead as a school bus plunged into a rivlet in Khammam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X