వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెరుగుతున్న ఒత్తిడి: యడ్డీకి గాలి బ్రదర్స్ మద్దతు

By Pratap
|
Google Oneindia TeluguNews

Yeddyurappa
బెంగళూర్: మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప బిజెపి అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. తనను ముఖ్యమంత్రిని చేసే వరకు బెంగళూర్ వదిలి అధిష్టానంతో చర్చలకు వెళ్లబోనని ఆయన మొండికేస్తున్నారు. యడ్యూరప్ప విధేయులు రిసార్టులో ఉండడంలో తప్పు లేదని ముఖ్మయంత్రి సదానంద గౌడ అంటున్నారు. అయితే, యడ్యూరప్ప మాత్రం అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెంచుతున్నారు. గనుల అధిపతి జి. కరుణాకర్ రెడ్డి సోమవారం రిసార్ట్‌కు వచ్చారు. నాయకులు తగిన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నట్లు ఆయన అన్నారు. కొంత మంది మంత్రులు యడ్యూరప్పకు తమ రాజీనామా లేఖలు ఇచ్చి, సమయానికి తగినట్లు తేదీలు మార్చుకోవాలని చెప్పారు.

యడ్యూరప్ప డిమాండ్‌ను విస్మరించలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. తాను ఢిల్లీకి వెళ్తే శాసనసభ్యులు జారిపోయే ప్రమాదం ఉందని భావించిన యడ్యూరప్ప అందుకు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. రిసార్టులో ప్రస్తుతం 50 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఆయనకు మద్దతిస్తున్న శాసనసభ్యుల సంఖ్య 70కి చేరినట్లు చెబుతున్నారు. యడ్యూరప్ప వర్గానికి చెందిన శాసనసభ్యులు మంగళవారం శాసనసభకు గైర్హాజరయ్యారు.

అయితే, రేపు బుధవారం సదానంద గౌడకు బడ్జెట్ ప్రతిపాదించే అవకాశం కల్పించాలని బిజెపి అధ్యక్షుడు నితిన్ గడ్కరీ యడ్యూరప్పకు సూచించినట్లు తెలుస్తోంది. యడ్యూరప్ప పెట్టిన 48 గంటల గడువు మంగళవారం సాయంత్రం ముగుస్తుండడంతో గడ్కరీ ఆ సూచన చేసినట్లు తెలుస్తోంది. బిజెపి అధిష్టానానికి యడ్యూరప్ప గడువు పెట్టడం ఇది మూడోసారి.

English summary
In a further hardening of stand, former chief minister turned rebel BS Yeddyurappa has refused to go to Delhi for talks with BJP central leadership till he is reinstated as chief minister if Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X