డిఎల్ రాజీనామా: కిరణ్ రెడ్డిపై ఒత్తిడి పెంచేందుకే

ఇటీవల తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి వర్గం నేతలను మంత్రివర్గంలోకి తీసుకున్న తర్వాత కిరణ్.. డిఎల్ శాఖలకు కోత పెట్టారు. అప్పటికే డిఎల్ ముఖ్యమంత్రి పట్ల పూర్తి అసంతృప్తితో ఉన్నారు. ఆ తర్వాత శాఖలలో కోత పెట్టడంతో డిఎల్ రగిలిపోయారు. దీంతో అప్పుడే అతను రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సర్ది చెప్పడంతో ఆయన అప్పుడు వెనక్కు తగ్గారు. ముఖ్యమంత్రిపై అప్పటి నుండే రగులుతున్న డిఎల్ అదును కోసం చూశారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెసు ఘోర వైఫల్యం చెందడంతో ఆయన దీనిని ఉపయోగించుకుంటున్నారని అంటున్నారు. ఆయన ఖచ్చితంగా మంత్రి పదవికి రాజీనామా చేయాలనుకుంటే గవర్నర్కు పంపించాల్సి ఉంది. కానీ ఆయన సోనియా గాంధీకి పంపడం విశేషం. అంటే అతను రాజీనామా చేసింది కిరణ్పై ఒత్తిడి పెంచేందుకేనని అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications