జానా ఇంట్లో టి-ఎంపీల భేటీ, 'తెలంగాణ'పై వ్యూహ రచన

కాగా ఎంపీలు సమావేశమైన మంత్రి జానా రెడ్డి నివాసం ముందు తెలంగాణ జాగృతి విద్యార్థి ఆందోళన నిర్వహించారు. జానా ఇంటిని ముట్టడించి జై తెలంగాణ నినాదాలు చేశారు. జానారెడ్డి వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణ ప్రకటించేలా ఒప్పించాలని వారు డిమాండ్ చేశారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టేలా ఒత్తిడి తేవాలని ఎంపీలను తెలంగాణ జాగృతి కార్యకర్తలు డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న బోజ్యా నాయక్ కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
భేటి అనంతరం గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. బోజ్యా మృతికి అందుబాటులో ఉన్న ఎంపీలం భేటీ అయి సంతాపం తెలిపామని చెప్పారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకు వెళతామని చెప్పారు. పార్లమెంటు సభ్యులుగా మా బాధ్యతగా మేం తెలంగాణ సాధన కోసం మా ప్రయత్నం చేస్తామన్నారు. తెలంగాణ ఆలస్యానికి ఎవరు బాధ్యులు అయినా ఆత్మహత్యలకు హామీలు ఇచ్చిన అన్ని పార్టీలది అన్నారు. ఈ విషయాన్ని పార్లమెంటు, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతామని చెప్పారు. అందరి లక్ష్యం తెలంగాణ అన్నారు. అందుకోసమే మా పోరాటమన్నారు. తెలంగాణ సాధనే మా లక్ష్యమన్నారు. ఎవరి అజెండాతో మాకు సంబంధం లేదన్నారు. తెలంగాణ కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకు వస్తామని చెప్పారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications