రాజకీయాల్లోకి డబ్బు సంస్కృతి చరిత్ర బాబుదే: గండ్ర

స్పీకర్ సభలో ఆత్మహత్యలకు సంతాపం తెలిపినప్పుడు తెలంగాణ అని అంటే బాగుండేదన్నారు. తెలంగాణ ప్రజల మనోగతాన్ని తాము ఏఐసిసి పరిశీలకులు కృష్ణమూర్తికి వివరిస్తామని చెప్పారు. మాజీ మంత్రి, అనంతపురం జిల్లా పార్టీ సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు విభజనకు అంగీకారం తెలిపేలా ఉన్నాయని అన్నారు. తెలంగాణ ప్రాంతంలోని విద్యార్థులు, యువత ఎవరు కూడా ఆవేశంలో ఆత్మహత్య చేసుకోవద్దని సూచించారు. తెలంగాణ సాధించుకుందాన్నారు. కేంద్రం కూడా తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన అన్నారు. తెలంగాణ కోసం ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని ఎమ్మెల్యే కె లక్ష్మా రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉద్యమంలో తాము కీలకంగా లేమన్నారు. తెలంగాణ కోసం తాము చిత్తశుద్ధితో అధిష్టానంపై ఒత్తిడి తీసుకు వస్తున్నామన్నారు.
కాగా తెలంగాణ నేతలపై ఎమ్మెల్యే విష్ణు చేసిన వ్యాఖ్యలపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అలాంటి వ్యాఖ్యలు చేయవద్దని ఆయనను ఫోన్లో మందలించారు.












Click it and Unblock the Notifications