హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫ్లైట్ టిక్కెట్ కొంటే ఎవరైనా వెళ్లొచ్చు: శైలజానాథ్ సెటైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sailajanth
హైదరాబాద్: మంత్రి శైలజానాథ్ బుధవారం వెరైటీగా స్పందించారు. కాంగ్రెసు పార్టీలోని విభేదాలపై మీడియా పలకరించినప్పుడు ఆయన ఫ్లైట్ టిక్కెట్ కొంటే ఎవరైనా ఢిల్లీ వెళ్లవచ్చునని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి మార్పు అనేది కేవలం ఊహాగానాలేనని ఆయన కొట్టి పారేశారు. ముఖ్యమంత్రి మార్పు ఉండదని అన్నారు. సమైక్యవాదమే మా నినాదం అన్నారు. దానికే మేమంతా కట్టుబడి ఉన్నామని చెప్పారు. తెలంగాణ విషయంలో అధిష్టానం ఏదైనా నిర్ణయం తీసుకునే ఉద్దేశ్యంలో భాగంగా తమను ప్రశ్నిస్తే తాము సమైక్యవాదానికే కట్టుబడి ఉన్నామని చెబుతామన్నారు.

రాయల తెలంగాణ అనేది మాజీ మంత్రి, తమ పార్టీ సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అన్నారు. తాము మాత్రం సమైక్యవాదులమేనని చెప్పారు. అధికారంలో ఉండగా పెత్తనం చలాయించిన వారు ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పైన ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని అన్నారు. ఇది చాలా విడ్డూరమన్నారు.

English summary
Minister Sailajanath said that there is no differences in party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X