మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ కోసం చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
మెదక్: తెలంగాణ కోసం మరో ఆత్మబలిదానం చోటు చేసుకుంది. మెదక్ జిల్లాలోని తూఫ్రాన్ మండలం ఇనామ్‌పూర్ లో బుధవారం తెల్లవారుజామున యాదగిరి అనే యువకుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడే పడి ఉన్న సెల్‌ఫోన్‌లో తెలంగాణ కోసం చనిపోతున్నట్లు వాయిస్ రికార్డ్ చేసి ఉంది. సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతుడు రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం రాయలపూర్‌కు చెందినవాడని పోలీసులు గుర్తించారు.

కరీంనగర్ జిల్లాలో ఓ విద్యార్థిని తెలంగాణ కోసం మంగళవారం ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఇంటర్మీడియట్ చదువుతున్న పల్లవి అనే విద్యార్థిని ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండంల నిజామాబాద్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆమె స్థానిక జూనియర్ కళాశాలలో చదువుతూ ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు రాసింది. ఇంట్లో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న పల్లవిని కుటుంబ సభ్యులు సిరిసిల్ల ఆస్పత్రికి తరలించారు.

English summary
Another Youth committed suicide for Telangana in Medak district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X