హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ కోసం మరో రెండు ఆత్మహత్యాయత్నాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana Map
హైదరాబాద్/కరీంనగర్: తెలంగాణ కోసం ఆత్మహత్యయత్నాల పరంపర కొనసాగుతోంది. తెలంగాణ కావాలంటూ వరంగల్ జిల్లాలో ఇద్దరు, మెదక్ జిల్లాలో ఒకరు ఐదు రోజుల వ్యవధిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా బుధవారం మరో ఇద్దరు తెలంగాణ కోసం ఆత్మహత్యాయత్నం చేశారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్ పరిధి ఎన్టీఆర్ నగర్‌కు చెందిన సిరిపురం శ్రీకాంత్ స్థానిక మార్కెట్లో పార్కింగ్ వద్ద పని చేస్తూ జీవనం సాగిస్తున్నారుడ. బుధవారం సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటికి నిప్పంటించుకొన్నాడు. తెలంగాణ నినాదాలు చేస్తూ బయటకు పరుగులు తీశాడు. స్థానికులు వెంటనే అతనిని ఉస్మానియాకు తరలించారు. 90 శాతం కాలిన గాయాలతో ఆయన పరిస్థితి విషమంగా ఉంది. కాగా 2009 డిసెంబర్ ఉద్యమ తరుణంలో తొలి బలిదానం చేసిన శ్రీకాంతచారికి ఈ శ్రీకాంత్ బంధువు అని తెలుస్తోంది.

కరీంనగర్ జిల్లాలోనూ ఓ విద్యార్థిని తెలంగాణ కోసం ఆత్మహత్యాయత్నం చేసింది. కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని నిషాని పల్లవి మంగళవారం ఒంటికి నిప్పంటించుకుంది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఆమెను సిరిసిల్ల నుండి హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

English summary
Two persons from Hyderabad and Karimnagar attempted to suicide on wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X