వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టివిలో క్రైమ్ సీరియల్ చూశారు, స్నేహితుడ్ని చంపారు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Pune Map
పూణే: టెలివిజన్ ఛానెళ్లలో వచ్చే కార్యక్రమాలు నేర సంబంధ ప్రసారాల ప్రభావం విద్యార్థులపై పడుతోంది. ఓ టీవి ఛానల్‌లో వచ్చే ఓ కార్యక్రమాన్ని చూసిన విద్యార్థులు దానికి ప్రభావితమై తన స్నేహితుడేనే హతమార్చారు. నేరపూరిత సీరియళ్లు ఓ చిన్నారి ప్రాణాన్ని బలిగొనగా, మరో ముగ్గుర్ని నేరస్తులుగా మార్చాయి. ఈ ఘటన పూణేలో ఆదివారం జరిగింది. నగరానికి చెందిన పదహారు సంవత్సరాల విద్యార్థి శుభమ్ షిర్కేను మిత్రులే కిడ్నాప్ చేసి సమీపంలోని కొండ పైకి తీసుకు వెళ్లారు. శుభమ్ తండ్రికి ఫోన్ చేసి యాభై వేల రూపాయలు డిమాండ్ చేశారు. డబ్బులు ఇస్తేనే విడుదల చేస్తామని హెచ్చరించారు. చివరకు పదిహేను వేల రూపాయలు శుభమ్ తండ్రి చెల్లించారు. రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో ఆ డబ్బులు తీసుకున్న విద్యార్థులు శుభమ్‌ను విడిచి పెట్టక పోగా అతని గొంతు నులిమి చంపేశారు.

డబ్బు చెల్లించినా తన తనయుడు ఇంటికి రాకపోవడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి సహచర విద్యార్థులను ప్రశ్నించారు. తాను మరో ఇద్దరితో కలిసి ఈ నేరం చేసినట్లు అందులో ఓ విద్యార్థి చెప్పాడు. అలా ఎందుకు చేశారని పోలీసులు ప్రశ్నిస్తే.. టీవిలో వచ్చే ఓ క్రైం సీరియల్ చూసి తాము ఈ అపరహణ పథకం వేశామని చెప్పారు. తొలుత నగల వ్యాపారి కుమారుడిని అపహరించాలని చూసినప్పటికి అది విఫలమవడంతో శుభంను నిర్బంధించారు.

English summary
A 15-year-old boy, who had recently appeared for the SSC examinations, was kidnapped and strangulated to death by his former classmate and two other teenagers at a secluded place in Dighi on Saturday afternoon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X