భీకర ఎన్కౌంటర్: 13 మంది మావోయిస్టుల హతం?

లతేహార్ జిల్లాలోని బర్వాదియా అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం 11.30 గంటలకు ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి. గాయపడినవారిలో ఓ కోబ్రా జవాను, మరో జాగ్వార్ ఫోర్స్ జవాను ఉన్నట్లు సమాచారం. ఎదురు కాల్పుల్లో ఎంత మంది మరణించారనేది మృతదేహాలను స్వాధీనం చేసుకుంటే తప్ప చెప్పలేమని పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ (ఆపరేషన్) ఆర్ కె మాలిక్ చెప్పారు.
మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టినప్పుడు ఈ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఆరుగురు మావోయిస్టులు మరణించి ఉండవచ్చునని మాలిక్ అంటున్నారు. అయితే, 13 మంది మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. వీరిలో కూడా పది మంది మావోయిలు, మరో ముగ్గురు వేరేవారని అంటున్నారు. వివరాలు అందాల్సి ఉంది.












Click it and Unblock the Notifications