కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కూతుళ్లను చంపిన కిరాతక తండ్రి, తల్లి ఫిర్యాదు

By Pratap
|
Google Oneindia TeluguNews

Prakasam Map
ఒంగోలు/ కరీంనగర్: తన ఇద్దరు కూతుళ్లను చంపిన ఓ కిరాతక తండ్రి ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా పామూరుకు చెందిన నజీర్ ఖాన్ అనే వ్యక్తి తన ఇద్దరు ఆడపిల్లలను నిర్దాక్షిణ్యంగా హత్య చేశాడు. ఓ కూతురును 8 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత మదర్సాలో చేర్పిస్తానని చెప్పి తీసుకుని వెళ్లాడు. అలా తీసుకుని వెళ్లి హత్య చేశాడు.

రెండో కూతురు షాజిదాను ఏడాది క్రితం మత్తుమందు ఇచ్చి చంపేశాడు. కూతుళ్ల గురించి అనుమానం వచ్చి నజీర్‌ఖాన్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో నజీర్ ఖాన్ దుర్మార్గం బయటపడింది. నజీర్‌ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసును దర్యాప్తు చేస్తున్నారు. కేసులో సాక్ష్యాధారాలను సేకరించే ప్రయత్నాలు చేస్తున్నారు.

కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం మల్‌చెరువు తండాలో తోడికోడళ్లు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. వారిలో ఒకామె మరణించింది. మరో స్త్రీ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కుటుంబ తగాదాల కారణంగా వారు ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు సమాచారం.

English summary
A merciless person killed his two daughters at Pamuru village of Prakasham district. In another incident two women attempted to commit suicide in Karimnagar district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X