సలేశ్వర ఉత్సవాల్లో తొక్కిసలాట, ఇద్దరు మృతి

Saleswaram
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలో జరుగుతున్న సలేశ్వర ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. శనివారం ఉదయం సలేశ్వర లింగమయ్యను దర్శించుకోడానికి పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 20 మంది భక్తులకు గాయాలయ్యాయి. గాయపడిన వారికి చికిత్స అందజేస్తున్నారు.

ఏటా చైత్ర పౌర్ణమి నాడు జరిగే సలేశ్వర జాతరకు పెద్ద యెత్తున భక్తులు తరలివస్తారు. కొండలు, గుట్టల మధ్య వేయి అడుగుల లోతులో ఉన్న లింగమయ్యను దర్శించుకుంటారు. అక్కడ ఎత్తైనకొండలు, చెట్లు, పచ్చదనాలతో ఆహ్లాదకరమైన వాతావరణం ప్రజలను ఆకట్టుకుంటుంది. అదే విధంగా ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. అయితే లక్షలాది మంది భక్తులు వస్తున్నా ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు.

సల్వేశ్వరం ఉత్సవాలకు సరిగా ఏర్పాట్లు కూడా లేవని తెలుస్తోంది. సలేశ్వర లింగమయ్యను దర్ఛించుకోవడానికి చేసే యాత్ర సాహసోపేతమైందనే అంటారు. దట్టమైన నల్లమల అడవుల్లో ఈ లింగమయ్య ప్రార్థనా స్థలం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+