బాబు స్కూల్లో ఆ పాఠాలే, అవి మాకొద్దు: బొత్స కౌంటర్

ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. బాబు స్కూల్లో అన్నీ ప్రజా వ్యతిరేక పాఠాలే ఉంటాయని చెప్పారు. అందుకే ఆయన పాఠాలు తమకు అవసరం లేదని చెప్పారు. మేం ప్రజలకు దగ్గరయ్యేలా ఉంటున్నామని, కానీ ఆయన పాఠాలు మాత్రం ప్రజలకు చెక్ చెప్పేలా ఉంటాయని విమర్శించారు. అలాంటి పాఠాలు మాకు అవసరం లేదన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెసు పార్టీ నాయకుడే అన్నారు. ఆయన ఫోటోను మేం ఉపయోగించుకుంటామని చెప్పారు. ఉప ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల లోపు రావొచ్చు లేదా రాకపోవచ్చునని చెప్పారు. ఉప ఎన్నికలు ఎన్నికల సంఘం చేతిలో ఉంటుందని, స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పారు. త్వరలో స్థానిక ఎన్నికలు ఉంటాయని చెప్పారు.
తిరుపతి నియోజకవర్గంలో కాంగ్రెసు పార్టీ తరఫున మంచి అభ్యర్థిని పరిశీలించి త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. టిక్కెట్లు ఆశించే వారు ఎక్కువగా ఉండటంతో అభ్యర్తి ఎంపికలో జాప్యం జరుగుతోందన్నారు. జరగబోయే ఉప ఎన్నికలలో అభివృద్ధే తమ ప్రధాన ప్రచార అజెండా అని చెప్పారు. అత్యధిక స్థానాలు కాంగ్రెసు పార్టీ సొంతం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications