బాబుకు ఝలక్, టిఆర్ఎస్లోకి మాజీ డిజిపి పేర్వారం

తెలంగాణ కోసం జరుగుతున్న ఆత్మహత్యలను నిరోధించి, భరోసా ఇచ్చేందుకే తాను తెరాసలో చేరుతున్నట్లు పేర్వారం చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని తెరాస ఎప్పటికీ సజీవంగా ఉంచుతుందనే నమ్మకం తనకు ఉందని ఆయన చెప్పారు. తెలంగాణ కోసం ఉద్యమాన్ని సజీవంగా ఉంచాల్సిన అవసరముందని అందుకే తాను తెరాసతో కలిసి వెళ్లేందుకు సిద్ధపడ్డట్లు చెప్పారు.
కాగా పేర్వారం రాములు వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురం గ్రామానికి చెందిన వారు. ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యది పేర్వారంది ఒకే గ్రామం. పేర్వారం తెలుగుదేశం పార్టీ హయాంలో డిజిపిగా పని చేశారు. 2003లో పదవీ విరమణ చేశారు. అనంతరం ఆయన తెలుగుదేశం పార్టీలో కొనసాగారు.
2008వ సంవత్సరం వరకు ఆయన తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన ఆరె కులస్తుల సంక్షేమ సంఘాల్లో అడపాదడపా పని చేస్తున్నారు. తాజాగా ఆయన తెరాసలో చేరనున్నట్లు ప్రకటించారు.
-
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్












Click it and Unblock the Notifications