ఇండోనేషియాలో మళ్లీ భూకంపం, సునామీ వార్నింగ్ నో

భూకంపం వచ్చిన బందా పాపువా ప్రాంతంలో భూకంపాలు తరుచూ వస్తుంటాయి. ఇండోనేషియా రింగ్ ఆఫ్ పైర్లో ఉంది. పసిఫిక్ సముద్రంలో సంభవించే మార్పుల వల్ల భూకంపాలు వస్తుంటాయి. డిసెంబర్ 2004లో సుమత్రాలో భారీ భూకంపం వచ్చింది. అది రెక్టర్ స్కేలుపై 9.1గా నమోదైంది. దాంతో సునామీ వచ్చింది. ఇందులో 2 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
భూకంపం వల్ల మనోక్వారీలో ఏ విధమైన నష్టం వాటిల్లలేదని, అయితే, దానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాన్సికిలో మాత్రం భారీ నష్టం వాటిల్లిందని అంటున్నారు. కొన్ని భవంతులు కూలిపోయాయని, చెట్లు విరిగిపడిపోయాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.
పశ్చిమ పాపువాలోని ప్రజలు భూకంపానికి భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం 10 కిలోమీటర్ల లోతులో చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. భవంతులు భూకంప తీవ్రతకు వణికిపోయాయి.












Click it and Unblock the Notifications