నో టెన్షన్: మీడియా సమావేశంలో చిరునవ్వుతో భాను

టిషర్టు ధరించి ఉన్న భాను మొహంలో ఎలాంటి ఆందోళన కానీ, ఏ అలసట కానీ కనిపించలేదు. విలేకరుల సమావేశం సమయంలో భాను చేతులు రెండింటిని వెనక్కు కట్టేసి నిలబెట్టారు. కాగా భాను కిరణ్ను కోర్టులో ప్రవేశ పెట్టారు. కోర్టు ఆయనకు నాలుగో తేది వరకు రిమాండ్ విధించింది.
చెర్లపల్లి జైలులోని మానస బ్యారెక్లో భాను కిరణ్ను పోలీసులు ఉంచారు. ఉదయం ఆరు గంటలకు తోటి ఖైదీలతో పాటు కిచిడీ తిన్నాడు. పోలీసులను అడిగి కొన్ని పత్రికలను తెప్పించుకొని చదివాడు. మరోవైపు భాను కిరణ్ సూరిని హత్య చేసిన అనంతరం సెల్ ఫోన్ కు దూరంగా ఉండిపోయాడు. సెల్ ఫోన్ వాడితో దొరికిపోవచ్చునని భావించిన భాను హత్య చేసిన కొద్ది సేపటికే ఫోన్ పారేశాడు.
అప్పటి నుండి గత ఫిబ్రవరి వరకు సెల్ ఫోన్ ఉపయోగించలేదు. తన కుటుంబ సభ్యులతో కేవలం పబ్లిక్ ఫోన్ బూత్ల నుండే మాట్లాడేవాడు. సియోనిలో రూ.3వేలు లంచం ఇచ్చి రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తదితర ధృవపత్రాలు తీసుకున్నాడు. ఫిబ్రవరిలో ఓ సిమ్ కార్డు సంపాదించాడు. ఇది మధ్యప్రదేశ్ కు చెందినది కావడంతో పోలీసులు గుర్తించలేక పోయారు.
ఆ సిమ్ కార్డుతోనే అప్పుడప్పుడు తన కుటుంబ సభ్యులతో మాట్లాడేవాడు. తండ్రి చిన్నప్పుడు మృతి చెందడంతో తన తల్లి, ఇతర కుటుంబ సభ్యుల పట్ల కొంత ఆందోళన చెందేవాడట. కాగా గత పద్నాలుగు నెలలుగా అజ్ఞాతంలో ఉన్న భాను కిరణ్ శనివారం డబ్బుల కోసం వచ్చి సిఐడి పోలీసులకు దొరికి పోయిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications