వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భానుతో నా కొడుకు లింక్ వార్తలపై దర్యాప్తు: సబితా

By Pratap
|
Google Oneindia TeluguNews

Sabitha Indra Reddy
నల్లగొండ: గంగుల సూర్యనారాయణ రెడ్డి అలియాస్ మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌తో తన కుమారుడు కార్తిక్ రెడ్డికి సంబంధాలున్నట్లు వచ్చిన ఆరోపణలపై సిఐడి దర్యాప్తు చేస్తుందని రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి చెప్పారు. భాను కిరణ్‌తో కార్తిక్ రెడ్డికి సంబంధాలున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించిన విషయం తెలిసిందే.

మద్దెలచెర్వు సూరి హత్య కేసులో దోషులు ఎంతటివారైనా వదిలిపెట్టబోమని ఆమె మీడియా ప్రతినిధులతో అన్నారు. సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌ను పట్టుకోవడంలో సిఐడి విజయం సాధించిందని ఆమె ప్రశంసించారు. విజయనగరం సంఘటనను ఆ జిల్లా ఎస్పీ చూసుకుంటారని ఆమె చెప్పారు. విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడున ధర్నా కార్యక్రమం ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే.

భాను కిరణ్‌తో కార్తిక్ రెడ్డికి సంబంధాలున్నాయని చాలా కాలంగా ఆరోపణలు వస్తున్నాయి. విజయవాడకు చెందిన ఓ సంస్థ వివాదంలో జోక్యం చేసుకున్న సంఘటనలో కూడా కార్తిక్ రెడ్డి పేరు ముందుకు వచ్చింది.

English summary
Home Minister Sabitha Indra Reddy said investigation will be don on allegations of involvement of his son Karthik Reddy in Bhanu Kiran's affairs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X