చిరంజీవి కేంద్రపదవికి 'తిరుపతి' లింక్, కిరణ్కూ స్పెషల్

అయితే తిరుపతికి మాత్రం చిరంజీవి రాజ్యసభకు వెళ్లడం ఉప ఎన్నికల జరగనుంది. ఈ నేపథ్యంలో మిగిలిన వాటన్నింటి కంటే కాంగ్రెసుకు ముఖ్యంగా చిరంజీవికి ఈ స్థానం ప్రతిష్టాత్మకమైనది. మిగిలినచోట్ల గెలుపోటముల విషయం ఎలా ఉన్నా తిరుపతిలో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెసు గెలవాల్సిందే. లేదంటే కాంగ్రెసుతో పాటు చిరంజీవి పరువు కూడా పోతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం కూడా చిరు కేంద్ర పదవికి, తిరుపతికి లింక్ పెట్టిందనే వాదన వినిపిస్తోంది.
తిరుపతిలో కాంగ్రెసు అభ్యర్థిని గెలిపించే బాధ్యత పూర్తిగా చిరంజీవికే అప్పగించిందట. మిగిలిన నియోజకవర్గాలలో ప్రచార బాధ్యతలను అప్పగిస్తూనే తిరుపతిని మాత్రం ప్రత్యేకంగా తీసుకోవాలని సూచించిందట. అదే సమయంలో చిరుకు హామీ ఇచ్చిన మంత్రి పదవిని ఉప ఎన్నికల ఫలితాల తర్వాతే ఇవ్వనున్నారని అంటున్నారు.
తిరుపతిలో కాంగ్రెసు అభ్యర్థి గెలిస్తే ఆయనకు పదవి ఇస్తారని, ఒకవేళ పార్టీ ఓడితే చిరు ఆశలు వదులుకోవాల్సిందేనని అంటున్నారు. గత డిసెంబర్లో తెలుగుదేశం ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం సమయంలో చిరు అండ్ కో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని గట్టెక్కించారు. ఆ తర్వాత తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేశారు. అప్పుడే అధిష్టానం చిరుకు కేంద్ర పదవి హామీ ఇచ్చిందనే వార్తలు వచ్చాయి. అయితే తిరుపతి గెలుపుకి, పదవికి సంబంధం లేదని మరికొందరు చెబుతున్నారు.
మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కూడా తిరుపతి నియోజకవర్గం ప్రత్యేకమైనది. ఇది తన సొంత జిల్లాలో ఉంది కాబట్టి అక్కడ పార్టీని గెలిపించుకోకపోతే ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఆయనను ఎప్పుటికప్పుడు సిఎం పీఠం నుండి దింపే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications