బిజెపికి బంగారు లక్ష్మణ్ గుడ్బై, జైలు శిక్ష పడినందుకే

జైలు శిక్ష పడిన తర్వాత బంగారు లక్ష్మణ్ను పార్టీ దూరంగా పెట్టింది. బంగారు లక్ష్మణ్ వ్యక్తిగత స్థాయిలోనే లంచం అంగీకరించారని, దాంతో పార్టీకి ఏ విధమైన సంబంధం లేదని స్పష్టం చేసింది. దీంతో బంగారు లక్ష్మణ్ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యత్వానికి రాజీనామా చేశారని అంటున్నారు. పార్టీ జాతీయాధ్యక్షుడిగా ఉన్న సమయంలో బంగారు లక్ష్మణ్ లంచాన్ని అంగీకరిస్తూ తెహెల్కా స్గింగ్ ఆపరేషన్కు చిక్కారు.
తెహెల్కా కుంభకోణం స్టింగ్ ఆపరేషన్ కేసులో బిజెపి మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్కు ఢిల్లీ కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. లక్ష్మణ్కు ఐదేళ్ల జైలు శిక్ష విధించాలని సిబిఐ కోరింది. అయితే, తన అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని శిక్షను తగ్గించాలని బంగారు లక్ష్మణ్ కోర్టును కోరారు. దీంతో 72 ఏళ్ల బంగారు లక్ష్మణ్కు కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించడమే కాకుండా లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది. లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ తెహెల్కా స్టింగ్ ఆపరేషన్లో దొరికిన బంగారు లక్ష్మణ్ను కోర్టు శుక్రవారం దోషిగా నిర్దారించింది. ఆయనకు శనివారం కోర్టు శిక్షను ఖరారు చేసింది.
బంగారు లక్ష్మణ్ 2001లో లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ లక్ష్మణ్ పట్టుబడ్డారు. అప్పటి నుంచి 11 ఏళ్ల పాటు ఈ కేసు విచారణ జరిగింది. బంగారు లక్ష్మణ్కు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయనను కస్టడీలోకి తీసుకుని తీహార్ జైలుకు తరలించారు. లక్ష్మణ్ను శనివారం కోర్టులో ప్రవేశపెట్టారు. శుక్రవారం కోర్టు తీర్పు తర్వాత బంగారు లక్ష్మణ్ కోర్టు హాల్లో కంటతడి పెట్టారు.
స్టింగ్ ఆపరేషన్లో పట్టుబడినప్పుడు బంగారు లక్ష్మణ్ బిజెపి జాతీయాధ్యక్షుడిగా ఉన్నారు. ఈ కుంభకోణంతో ఆయన పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన బంగారు లక్ష్మణ్ అంచెలంచెలుగా పార్టీ జాతీయాధ్యక్షుడి దాకా ఎదిగారు. అయితే, తెహెల్కా చేపట్టిన స్టింగ్ ఆపరేషన్తో ఆయన జాతకం తిరగబడింది.
ఢిఫెన్స్ డీల్లో ఆయుధ డీలర్లుగా చెప్పుకుని మారు రూపాల్లో వెళ్లిన తెహెల్కా జర్నలిస్టుల నుంచి లంచం తీసుకుంటూ బంగారు లక్ష్మణ్ పట్టుబడ్డారు. తెహెల్కా వెబ్సైట్ జర్నలిస్టులు స్టింగ్ ఆపరేషన్ చేసి బంగారు లక్ష్మణ్ ఉదంతాన్ని బయటపెట్టారు. తెహెల్కా స్టింగ్ ఆపరేషన్ సిడిలను 2001 మే 13వ తేదీన విడుదల చేశారు.
ఆయుధ డీలర్లుగా చెప్పుకుంటూ వెళ్లిన జర్నలిస్టుల నుంచి బంగారు లక్ష్మణ్ లక్ష రూపాయలు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. బంగారు లక్ష్మణ్ మాజీ వ్యక్తిగత కార్యదర్శి టి. సత్యమూర్తికి ట్రయల్ కోర్టు క్షమాభిక్ష ప్రసాదించింది. అతను అప్రూవర్గా మారడంతో సత్యమూర్తిని కోర్టు క్షమించింది.
-
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications