చిరంజీవిపై నిప్పులు చెరిగిన వైయస్ జగన్

YS Jagan
తిరుపతి: కాంగ్రెసు నాయకుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మంగళవారం తిరుపతిలోని తిమ్మనాయుడుపాలెంలో పర్యటించారు. తిరుపతి నియోజకవర్గ ప్రజలకు చిరంజీవి చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా చిరంజీవి స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

చిరంజీవి శానససభ్యుడిగా ఎన్నికైన తర్వాత తిరుపతి నియోజకవర్గంలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు ఒక్కటి కూడా మంజూరు కాలేదని ఆయన అన్నారు. త్వరలో సువర్ణ యుగం వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. గాలేరు నగరి ప్రాజెక్టును పూర్తి చేసి తిరుపతి ప్రజలకు మంచినీరు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. తనది పేదకులమని అన్నారు. చిరంజీవి పిఆర్పీని హోల్ సేల్‌గా కాంగ్రెసుకు అమ్మేశారని ఆరోపించారు. వైయస్ రాజశేఖర రెడ్డి తర్వాత రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్నారు.

చిరంజీవి వ్యక్తిగత స్వార్థంతో, పదవీ కాంక్షతో తిరుపతి శానససభా స్థానానికి రాజీనామా చేశారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, సినీ నటి రోజా ఆరోపించారు. పార్టీని నడపలేక చిరంజీవి కాంగ్రెసుకు అమ్ముడుపోయారని ఆమె దుయ్యబట్టారు. మరోవైపు తొమ్మిదేళ్ల పాలనలో చిత్తూరు జిల్లాకు, తిరుపతి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిందేమీ లేదని రోజా విమర్శించారు.

తిరుపతి ఉప ఎన్నికల్లో కాంగ్రెసు, తెలుగుదేశం నేతలకు భంగపాటు తప్పదని ఆమె అన్నారు. ఉప ఎన్నికల్లో భూమన కరుణాకర్ రెడ్డిని భారీ మెజారితో గెలిపించుకుంటామని ఆమె చెప్పారు. తిరుపతి పార్టీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి ఇంటి నుంచి వైయస్ జగన్ మంగళవారం తిరుపతిలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. రాజ్యసభకు ఎన్నికైన చిరంజీవి రాజీనామా చేయడంతో తిరుపతి శాసనసభా స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+