సిబిఐ ఫ్రీజ్ చేసిన సాక్షి టీవీ ఖాతాలో రూ. 110 కోట్లు

సాక్షి మీడియా బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేయడాన్ని జగన్ పత్రికా స్వేచ్ఛపై దాడిగా వైయస్ జగన్ అభివర్ణిస్తున్నారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు (ఐఒబి) జూబ్లీహిల్స్ శాఖలో ఉన్న మరో రెండు కంపెనీల ఖాతాలను సిబిఐ బుధవారం స్తంభింపజేస్తింది. జగతి పబ్లికేషన్స్ (సాక్షి దినపత్రిక), ఇందిరా టెలివిజన్ (సాక్షి టీవీ), జననీ ఇన్ఫ్రాలకు చెందిన బ్యాంకు ఖాతాల లావాదేవీలను సిబిఐ మంగళవారం నిలిపేసింది. ఈ ఖాతాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (జూబ్లీహిల్స్ శాఖ), ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (బంజారాహిల్స్ శాఖ)ల్లో ఉన్నాయి.
వైయస్ జగన్ ఆస్తుల కేసు విచారణలో భాగంగా సిబిఐ సాక్షి మీడియాకు చెందిన బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేసింది. తమ వాదనలు వినకుండా ఖాతాలను స్తంభింపజేయడాన్ని ఇందిరా టెలివిజన్, జననీ ఇన్ఫ్రా కోర్టులో సవాల్ చేశాయి. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రత్యేక న్యాయమూర్తి పట్టాభి రామారావు సిబిఐని అదేశించారు. సాక్షి దినపత్రికను, సాక్షి టీవీని మూసివేయించాలనే కుట్రలో భాగంగానే ఖాతాలను స్తంభింపజేశారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు.
కాగా, సాక్షి మీడియా ఖాతాల స్తంభనను తెలుగుదేశం పార్టీ సమర్థిస్తోంది. పత్రికా స్వేచ్ఛకు, అవినీతికి సంబంధం లేదని, ఖాతాల స్తంభనను పత్రికా స్వేచ్ఛతో ముడిపెట్టకూడదని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా అదే వాదనను వినిపించారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications