విజయవాడలో కల్తీ మద్యం తాగి నలుగురి మృతి?
గురువారం రాత్రి పన్నెండు గంటల సమయంలో వీరు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటన విజయవాడలోని కొత్తకోట బ్రాహ్మణవీధిలో చోటు చేసుకుంది. మృతదేహాలను పోలీసులు పంచనామా కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలం వద్ద దొరికిన మద్యం సీసాలను పరీక్షల నిమిత్తం పంపించారు.
ఆ రిపోర్ట్ వస్తే కల్తీ మద్యం తాగారా, కల్తీ సారా తాగారా మరేమైనానా అనే విషయం తెలుస్తుంది. కాగా మృతి చెందిన వారిలో యేసు, దుర్గారావు, కోటేశ్వర రావులను పోలీసులు గుర్తించారు. మరో వ్యక్తిని గుర్తించాల్సి ఉంది. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది.
కాగా శ్రీకాకుళం జిల్లా పురుషోత్తమపురం చెక్ పోస్టు పై దుండగులు మూడు నాటు బాంబులను విసిరి పరారయ్యారు. అయితే ఈ ప్రమాదం నుంచి సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.