కాంగ్రెసుపై దుమ్మెత్తిపోసిన వైయస్ వివేకానంద రెడ్డి

ఒకప్పుడు వైయస్ రాజశేఖర రెడ్డిని ప్రశంసించిన కేంద్రం నేతలే ఇప్పుడు వైయస్ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన తప్పు పట్టారు. వైయస్ ఎప్పుడూ ప్రజలకు మేలు చేయాలనే కోరుకునేవారని ఆయన అన్నారు. విధానపరమైన ఆర్థిక నిర్ణయాలు మంత్రి వర్గం అనుమతితోనే జరుగుతాయని, వాటి పట్ల వైయస్కు మాత్రమే కాకుండా మంత్రులకూ బాధ్యత ఉంటుందని ఆయన అన్నారు.
కొత్త పన్నులు వేయకుండా ఆర్థిక వ్యవస్థను పరుగులు తీయించిన ఘనత వైయస్ రాజశేఖర రెడ్డిదేనని ఆయన అన్నారు. రాజకీయాలు చేయడంలో మునిగి తేలుతున్న కాంగ్రెసు నాయకులు వైయస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేయడాన్ని మరిచిపోయారని ఆయన అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని ఆనయ అన్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు అయోమయంగా, గందరగోళంగా ఉన్నాయని ఆయన అన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు మినీ ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు గట్టు రామచందర్ రావు అన్నారు. ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని ఆయన అన్నారు. తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి ప్రభుత్వానికి కాలం చెల్లిందని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications