హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ పార్టీలోకి ప్రచారంపై తలసాని:టిడిపిపై నో కామెంట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Talasani Srinivas Yadav
హైదరాబాద్: తాను కడప పార్లమెంటు సభ్యుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళుతున్నట్లుగా ఎందుకు ఊహాగానాలు వస్తున్నాయని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం విలేకరులను ప్రశ్నించారు. ఆయన సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు.

తాను బోయిన్‌పల్లి మార్కెట్ బంద్ వల్ల రైతులు, వ్యాపారులు పడుతున్న ఇబ్బందులను సిఎంకు వివరించినట్లు చెప్పారు. తాను ముఖ్యమంత్రి కలవడంలో ఎలాంటి రాజకీయ కోణం లేదని స్పష్టం చేశారు. వీరు జగన్ పార్టీలోకి వెళ్తున్నారా అని విలేకరులు ప్రశ్నించగా.. అలాంటి ఊహాగానాలు ఎందుకొస్తున్నాయన్నారు.

తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారా అని అడగ్గా.. అది పార్టీ కార్యాలయంలో మాట్లాడుతానని, ఇక్కడ కాదని తప్పించుకున్నారు. మార్కెట్‌లో జరుగుతున్న బందును పరిశీలించి దానిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరినట్లు చెప్పారు. ఎనభై ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిసారిగా మార్కెట్‌లో ఆరు రోజుల నుంచి బందు జరుగుతోందని ఆయన వివరించారు.

కాగా గత కొంతకాలంగా టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుపై తలసాని తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. తనకు రాజ్యసభ పదవి ఇవ్వకుండా దేవేందర్ గౌడ్‌కు ఇవ్వడంపై ఆయన అప్పుడే తన ఆవేదన వెల్లగక్కారు. ఆ తర్వాత గత కొంతకాలంగా ఆయన జగన్ పార్టీలోకి వెళతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది.

English summary

 Former minister and Telugudesam Party senior leader Talasani Srinivas Yadav responded on his joining rumors in Kadapa MP Y Jaganmohan Reddy's YSR Congress Party on Satureday after met chief minister Kiran Kumar Reddy at secreteriate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X