ఎవరు గెలిచినా ఓడేది ప్రజలే: తెలంగాణలో జెపి ప్రచారం

Jayaprakash Narayana
వరంగల్: అవినీతి అంతానికి బలమైన విధానం కావాలని లోక్‌సత్తా అధ్యక్షుడు, కూకట్‌పల్లి శాసన సభ్యుడు జయప్రకాశ్ నారాయణ బుధవారం అభిప్రాయపడ్డారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ), అవినీతి నిరోధక శాఖ(ఎసిబి)లకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలన్నారు. జెపి వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం నిమిత్తం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

అవినీతి పార్టీలకు ఓటు వేస్తే ఎవరు గెలిచినా ఓడేది మాత్రం జనమే అన్నారు. వందల కోట్లతో వ్యాపారం వేలకోట్లు సంపాదిస్తున్నారని మండిపడ్డారు. అవినీతికి పాల్పడే రాజకీయ నాయకులు, అధికారుల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోనే వ్యవస్థ కోసం పోరాటం చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రాజకీయ పార్టీలు అవినీతిమయంలో కూరుకుపోయాయన్నారు. వ్యవస్థ మార్పు కోసం కమ్యూనిస్టు పార్టీలతో కలిసి పోరాటం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు.

ఎన్నికల విధానంలో దామాషా పద్ధతి కోసం జాతీయ స్థాయిలో కలిసొచ్చే పార్టీలతో పోరాటం చేస్తామన్నారు. బలహీనమైన చట్టాల వల్ల అవినీతిపరులు తమ పని తాము కానిస్తున్నామన్నారు. అవినీతి నిరోధక శాఖకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని కోరుతూ త్వరలో హైకోర్టులో పిటిషన్ వేయనున్నట్లు ప్రకటించారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి డొల్ల పుచ్చకాయ అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వేరుగా అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిల స్వభావం వైయస్ విజయమ్మకే తెలుసునన్నారు. వైయస్ అవినీతికి కేంద్రం సహకారం చేసిందని ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+