అందువల్లే తిరుపతిలో ఓటమి: చిరంజీవి భాష్యం

ఉప ఎన్నికల ఫలితాల్లో ఓటమికి కొన్ని కారణాలు ఉన్నాయని, దీనిపై పార్టీలో చర్చ జరగాల్సి ఉందని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. గిట్టుబాటు ధర లభించకపోవడం, కరెంట్ కోత, పెట్రోల్ ధర పెంపు వంటివి తమ ఓటమికి కారణాలని ఆయన గురువారం హైదరాబాదులోని గాంధీభవన్లో అన్నారు. ప్రజాజ్వామ్యంలో ఇలాంటివి అప్పుడప్పడు జరుగుతూనే ఉంటాయని బొత్స అన్నారు. పార్టీకి ప్రజలు ఇచ్చిన తీర్పు ఒక హెచ్చరికగా భావిస్తామని అన్నారు. వర్గ విభేధాలను సరిదిద్దుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.
కర్నాటకలో శ్రీరాములు భారీ మెజారిటితో గెలిచారని అంతమాత్రాన ఆయన సచ్చీలుడు కాదని, జగన్మోహన్రెడ్డిని కాంగ్రెస్ కుట్రపన్ని అరెస్టు చేసిందని కొందరు ప్రచారం చేశారని, రాష్ట్రంలో అభివృద్ధి ఉన్నా, పరిస్థితులు అనుకూలించలేదని, ప్రజాస్వామ్యాన్ని పటిష్ట పరుచుకునేందుకు తాము ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఉప ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు కలిసి పనిచేశామని, అయినా ఓటమికి గల కారణాలు జిల్లా స్థాయిలో విశ్లేషణ జరుపుతామని అన్నారు. ధాన్యం మద్దతు ధరపై ముందుగా ప్రకటించి ఉంటే బాగుండేదన్నారు. రెండు చోట్ల కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రజలకు సత్తిబాబు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఉప ఎన్నికల్లో తాము శక్తివంచన లేకుండా ప్రచారం చశామని, ప్రధానంగా అవినీతిపైనే పోరాటం చేశామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తెలిపారు. అంత తకు ముందు నుంచే రైతు సమస్యలు, ధరల పెరుగుదల తదితర వాటి సమస్యలపై పోరాటం చేశామని ఆయన శుక్రవారం హైదరాబాదులో మీడియా ప్రతినిధులతో అన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి అరెస్టు పట్ల ప్రజల్లో కొంత సానుభూతి చూపిందని, ఉప ఎన్నికల ఫలితాలపై ఓటమికి గల కారణాలను పార్టీ సమావేశంలో చర్చిస్తామని అన్నారు. ఉప ఎన్నికల్లో ఉండడంవల్ల రాష్ట్రపతి అభ్యర్ధిపై ఇంకా చర్చలు జరపలేదని, ఇప్పుడే మి మాట్లాడలేనని, ఒకటి రెండు రోజుల్లో పార్టీతో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా చంద్రబాబు తెలిపారు.
-
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications