మంత్రి ధర్మాన తనయుడిని ప్రశ్నించిన ఎసిబి

మద్యం వ్యాపారంతో తనకుగానీ తన కుటుంబ సభ్యులకు గానీ సంబంధం లేదని చెప్పారు. గ్రానైట్ వ్యాపారం చేసుకుంటున్న తనను ఎసిబి అధికారులు పొరపాటున పిలిచారని తెలిపారు. కొన్ని సందేహాల నివృత్తికే మంత్రి కుమారుడు చిన్నీని ప్రశ్నించామని ఎసిబి డిఎస్పీ వెంకటేశ్వర రావు తెలిపారు. వ్యాపార నిర్వహణలో భాగంగా చిన్నీ అనే వ్యక్తికి ముడుపులు చెల్లించినట్టు రికార్డుల్లో వున్నమాట వాస్తవమేనన్నారు.
తాము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి విచారణకు ఆయన సహకరించారన్నారు. కాగా మద్యం సిండికేట్ల నుండి ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో పలువురు ప్రజాప్రతినిధులు వరంగల్, హైదరాబాద్ తదితర ప్రాంతాలలో ఎసిబి ముందు ఈ నెల 18 నుండి 20 వరకు హాజరు కానున్న విషయం తెలిసిందే.
మహబూబ్ నగర్ ఎమ్మెల్యే కవిత, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వీరయ్య, మాజీ ఎమ్మెల్సీ పువ్వాడ నాగేశ్వర రావు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున తాజాగా గెలిచిన ధర్మాన కృష్ణదాసు, చెన్నకేశవ రెడ్డి తదితరులు హాజరు కానున్నారు. ఈ మూడు రోజులలో వారు ఎసిబి ముందు హాజరై వివరణ ఇవ్వనున్నారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications