బెయిల్ పిటిషన్ కొట్టివేత:హైకోర్టులో శ్రీలక్ష్మికి చుక్కెదురు
శ్రీలక్ష్మి తన పాసుపోర్టు పోలీసులకు అందజేస్తారని, మంత్రుల ఆమోదంతోనే ఆమె చేశారని, సిబిఐ కావాలనే ఆమెపై ఆరోపణలు చేస్తోందని, సాక్ష్యాలు తారుమారు చేసినట్లు ఇంతకుముందు ఏమీ ఆధారాలు లేవని.. కాబట్టి ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని శ్రీలక్ష్మి తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు సిబిఐ వాదనలతో ఏకీభవించి బెయిల్ పిటిషన్ను కొట్టేశారు.
కాగా ఓఎంసి కేసులో అరెస్టైన శ్రీలక్ష్మి చంచల్గూడ మహిళా జైలులో ఉన్నారు. గతంలో ఆమెకు సిబిఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిపై సిబిఐ పైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు ఆమె బెయిల్ను రద్దు చేసింది. దీంతో ఆమె సిబిఐ ప్రత్యేక కోర్టులో లొంగిపోయారు.
అనంతరం శ్రీలక్ష్మి మళ్లీ బెయిల్ కోసం తన వంతు ప్రయత్నాలు చేశారు. తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ అక్కడ ఆమెకు బుధవారం చుక్కెదురయింది. మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిది అక్రమ అరెస్టు అంటూ దాఖలు చేసిన పిటిషన్ పైన వాదనలు కొనసాగుతున్నాయి.