రానున్నవి చీకటిరోజులేనా?: విద్యుత్తుపై సిఎం సమీక్ష

కోతలు లేకుండా చూసేందుకు సరిపడా విద్యుత్తు అందుబాటులో లేదని అధికారులు అంటున్నారు. గ్యాస్ ఆధారిత విద్యుత్కేంద్రాలను పనిచేయించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఉన్నట్లు తెలుస్తోంది. గ్యాస్ కొరతతో గత ఏడాదిన్నరగా రాష్ట్రంలోని రెండు గ్యాస్ ఆధారిత విద్యుత్కేంద్రాలు పనిచేయడం లేదని అంటున్నారు. వీటికి పని కల్పించేందుకు కేంద్రాన్ని గ్యాస్ సరఫరా చేయాలని కోరేందుకు ముఖ్యమంత్రి సమాయత్తమయ్యారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 40 మిలియన్ యూనిట్ల విద్యుత్ కోత ఉన్నట్లు అర్థమవుతోంది. ఈ భారీ విద్యుత్ లోటు వల్ల కోతలు పెరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. వానాకాలం వచ్చిన రాష్ట్రంలో విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయి. తాజా లోటుతో ఈ కోతలు మరింతగా పెరుగుతాయని అంటున్నారు. రాష్ట్రంలో 248 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా 208 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే అందుబాటులో ఉంది.
వర్షాలు లేక రిజర్వాయర్లలోకి నీరు రాకపోవడంతో జల విద్యుత్కేంద్రాల్లో కరెంట్ ఉత్పత్తి భారీగా పడిపోయింది. జల విద్యుదుత్పత్తి 4 మిలియన్ యూనిట్లకు పడిపోయింది. ప్రస్తుతం జెన్కో 88 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. 120 మిలియన్ యూనిట్ల విద్యుత్తును కేంద్రం నుంచి, ప్రైవేట్ సంస్థల నుంచి కొనుగోలు చేస్తోంది. మొత్తం మీద, వర్షాలు కరుణించకపోతే రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా తయారవుతుందని అంటున్నారు.
-
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ??












Click it and Unblock the Notifications